25 July, 2026 | 8:16 PM

Breaking News

జేవీఆర్ సీహెచ్‌పీని సందర్శించిన రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్   •   ప్రియుడి ఇంటి ఎదుట ప్రేమికురాలి నిరసన   •   ఘనంగా బీరన్న బోనాలు   •   తుమ్మలచెరువు ఆయకట్టుకు సీతారామ కెనాల్‌ ద్వారా తక్షణమే నిళ్లు ఇవ్వాలి   •   ఎల్ నినో పట్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి: ఏఎంసీ దోమ ఆనంద్   •   ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన పంటలు   •   గిరిజన గురుకుల కళాశాలలో 28న ఇంటర్ స్పాట్ అడ్మిషన్లకు కౌన్సెలింగ్   •   తాగునీటి కష్టాలు తీర్చేందుకు బోర్ వేయించిన ఎమ్మెల్యే...   •   బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం   •   వాసవి పాఠశాలలో ఆషాడ మాసం గోరింటాకు సందడి   •  

కేంద్ర మంత్రి రాజీనామా.. విద్యార్థుల ఘన విజయం

25-07-2026 07:13 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశంలోని విద్యావేత్తలు, విద్యార్థి లోకం సాధించిన ఘన విజయమని మెట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఖుతుబోద్దీన్ పాషా అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించారు.

దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు,అవకతవకలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ, వివిధ విద్యార్థి సంఘాలు చేపట్టిన పోరాటాల ఫలితంగానే కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనైనా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా, పారదర్శకమైన రీతిలో పోటీ పరీక్షలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.