calender_icon.png 2 February, 2026 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు తీరని అన్యాయం

02-02-2026 03:41:12 PM

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్(Union budget of India)పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) స్పందించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. తెలంగాణ వ్యవసాయంపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. ఎన్నిసార్లు కోరినా ఆయిల్ పామ్ పై దిగుమతి సుంకం పెంచలేదని ఆరోపించారు. పసుపు బోర్డుకు నిధులు కేటాయింపు లేదని మండిపడ్డారు. కొబ్బరి బోర్డు ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన లేదన్నారు. ఎరువుల ధరలూ పెరిగే అవకాశముందని తెలుస్తోందన్నారు. ఎరువుల ధరలు పెరిగితే రైతులపై మరింత భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.