23 April, 2026 | 1:56 PM

Breaking News

వర్షంతో కొనుగోళ్లలో తిప్పలు

21-04-2026 12:10 PM

నిర్మల్ ఏప్రిల్ 21( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో(Nirmal District) మంగళవారం కురిసిన అకాల వర్షం పంట కళ్ళల్లో నిలువ చేసిన పంటలకు నష్టాన్ని కలిగించింది. జిల్లాలో ఇప్పటికి యాసంగిలో సాగుచేసిన మొక్కజొన్న, జొన్న, మిర్చి, పొద్దు తిరుగుడు పంటలు ఆరబోస్తున్న సమయంలో కురిసిన వర్షం(Rain ) రైతులకు ఇబ్బందులకు కలిగించింది. అసలే తేమ ఉన్న పంటలపై వర్షం కురవడం వాతావరణం చల్లగా మారిపోవడంతో పంటను రక్షించుకునేందుకు రైతులు టార్పిండ్లను కప్పి కాపలా కాస్తున్నారు. కుంటాల నిర్మల్ నర్సాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసినట్టు రైతులు తెలిపారు. పంట కొనుగోలు జాప్యం చేయడం వలన రైతులకు నష్టం వాటిలిందని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు