24 June, 2026 | 12:01 AM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ

13-09-2025 10:16 AM
  1. రైతన్నకు  తప్పని తిప్పలు.. 
  2. తెల్లవారుజాము నుండే క్యూ లైన్ లో రైతులు 
  3. ఫెర్టిలైజర్ షాప్ ల వద్ద పడి కాపులు

నకిరేకల్, (విజయక్రాంతి): నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఫెర్టిలైజర్ షాప్ ల వద్ద యూరియా కోసం తెల్లవారుజాము నుండే రైతులు క్యూ లైన్ లో నిలబడి యూరియా దొరుకుతుందో లేదోనన్న ఆందోళనలో సహనం కోల్పోతున్నారు. పాస్ బుక్కులు, చెప్పులు లైన్లో వందలాదిమంది రైతులు సీరియల్ కోసం ఉంచి వేచి చూస్తున్నారు. ఒకరికి ఒకరు తోసు వేసుకుంటున్నారు.

వరి నాట్లు వేసుకుని రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు యూరియా కావలసినంత వేయకపోవడంతో పంట ఎదుగుదల లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు బస్తాలు ఇస్తే పొలాలకు సరిపోదని రైతులు ప్రశ్నిస్తున్నారు .ఉదయం నుంచి కుటుంబం మొత్తం వచ్చి లైన్లో నిలబడిన యూరియా మాత్రం దొరకటం లేదని వాపుతున్నారు... యూరియా అందకపోతే రైతులుగా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి రైతులకు కావలసిన యూరియాను సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

 పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ

నకిరేకల్ పట్టణంలోని మన గ్రోమోర్ వద్ద రైతులు  ఏరియా కోసం రైతులు బారులు తీరడంతో ఒకరికొకరు తోసుకోవడంతో స్థానిక ఎస్సై లచ్చిరెడ్డి , సిబ్బంది ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రైతులను సీరియల్ లో ఉంచి ఒకరి ఒకరిని పిలుస్తూ యూరియా పంపిణీ చేయించారు.