18 August, 2026 | 4:51 PM

Breaking News

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •  

యూరియా కొరతపై రైతుల ఆక్రోశం

13-09-2025 01:01 PM

ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా.

రైతులను బుజ్జగిస్తున్న పోలీసులు.

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. సుమారు వారం రోజులుగా యూరియా బస్తాల కోసం ఆయా ఫర్టిలైజర్ దుకాణాలు కార్యాలయాలు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విసిగి వేసగి శనివారం ఉదయం పాత వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ప్రధాన రహదారిపై బైటయించి ధర్నా చేపట్టారు.

దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీఐ అశోక్ రెడ్డి(CI Ashok Reddy) తన సిబ్బందితో కలిసి వచ్చి రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి యూరియా ఇప్పిస్తామనిహామీ ఇచ్చారు.  పంటలను కాపాడుకోవడం కోసం ఎరువులు సకాలంలో అందక పంటలు పూర్తిగా ఎర్రబారి నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో పనులు చేసుకోవాల్సిన రైతులంతా రోడ్ల వెంట తిరగాల్సిన పరిస్థితి దాపురించ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.