12 March, 2026 | 6:14 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ఆపాలి

09-03-2026 12:00 AM

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

ఇల్లందు టౌన్, మార్చి 8 (విజయక్రాంతి): ఇర్పా అమెరికా, ఇజ్రాయిల్ దాడులను వెంటనే ఆపాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఆదివారం ఇల్లందులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, నాయకులు డి.ప్రసాద్ మాట్లాడుతూ ఇర్పా దాడుల వల్ల చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు ఖండిస్తున్నా అమెరికా, ఇజ్రాయిల్ మొండివైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎండి రాసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.