07-10-2025 05:35:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): వాల్మీకి మహర్షి రచనలు సమాజానికి ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి రాసిన గ్రంథాలు వేదాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉపేందర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు.