calender_icon.png 7 October, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం

07-10-2025 05:39:24 PM

డోర్నకల్ నియోజకవర్గ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం..

మాజీ ఎమ్మెల్యే రెడ్య నాయక్..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం లాంటిదని అన్నారు. డోర్నకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రెడ్య నాయక్ ఆదేశానుసారం మరిపెడ బంగ్లా భార్గవ ఫంక్షన్ హాల్లో గ్రంధాల సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్య నాయక్ పాల్గొని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల శక్తి వంచన లేకుండా పనిచేసి మరిపెడ మండలంలో ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త యుద్ధానికి సిద్ధమై ఉండాలని స్థానిక ఎన్నికల్లో గెలుపు కాదు మెజారిటీ ముఖ్యం. డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హాయంలో రామచంద్రనాయక్ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టడం లేదని తన సొంత పనుల కోసం ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి నియోజవర్గానికి రావడం ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం అలాంటి ఎమ్మెల్యే డోర్నకల్ ప్రజలకు దొరకడం చాలా సిగ్గుచేటు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఊసురు పోసుకుంటుందని డోర్నకల్ నియోజకవర్గం ఏడు మండలాలలో ఎంపీపీ, జడ్పిటిసి అభ్యర్థులు భారీ మెజార్టీతో తెలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అచ్యుతరావు, మాజీ ఎంపీపీ వెంకన్న, రాంబాబు, రవీందర్ నాయక్, శాస్త్రి, శ్రీనివాస్, కాలు నాయక్, సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ గ్రామ పార్టీ యూత్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.