పెద్దపల్లి ఎంపీగా వంశీని గెలిపించాలి

23-04-2024 12:24:18 AM

l మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల, ఏప్రిల్ 2౨ (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని అధిక మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సోమవారం మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలం మేదరిపేట, లక్షెట్టిపేట, హాజీపూర్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థికి మంచిర్యాల నియోజక వర్గం నుంచి లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలలో రెండు అమలు చేస్తున్నదని, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత మిగిలినవి నెరవేరుస్తామన్నారు. యువ నాయకుడిని  పార్లమెంటుకు పంపి నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేద్దామని పేర్కొన్నారు. దండేపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యేలు ప్రేంసాగర్‌రావు, వివేక్ ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.