కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో వన మహోత్సవం
17-07-2026 03:22 PM
- ఏసీపీ, సీఐ చేతుల మీదుగా మొక్కల నాటకం
కొండపాక: కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ను గజ్వేల్ ఏసీపీ, తొగుట సీఐ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెద్ద వృక్షాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పచ్చదనం పెంపుతో కాలుష్యాన్ని తగ్గించి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డులు, పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు.






