25-09-2025 12:07:16 AM
* వైభవోపేతంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
* ఊరూరా ఘనంగా పూజలు అందుకుంటున్న దుర్గమ్మ
పాపన్నపేట, సెప్టెంబర్ 24 :జనమేజయుని సర్పయాగ స్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మం డలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రో జు బుధవారం తదియ పురస్కరించుకొని వనదుర్గామాతను అన్నపూర్ణదేవి (చంద్ర ఘంట) రూపంలో, నీలం రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆల య అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి నీలం రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేడు వనదుర్గాదేవిగా దుర్గమ్మ దర్శనం..
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన గురువారం వనదుర్గామాత కుష్మాండ (వనదుర్గా) దేవి రూపం, ఆకుపచ్చ రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.