30-10-2025 12:43:37 AM
ఏడుపాయలలో మళ్లీ మంజీరా పరవళ్లు
పాపన్నపేట: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలెని ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకున్నది. మంజీరా ప్రాజెక్టు ఎగువ నుంచి వరద వస్తుండటంతో వనదుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న 30 శతకోటి ఘనపుటడుగుల ఆనకట్ట పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది.
దీంతో వరదుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బుధవారం ఉదయం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.