calender_icon.png 7 November, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యావత్ భారతాన్ని ఏకం చేసిన "వందేమాతరం"

07-11-2025 11:49:17 AM

జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల,(విజయక్రాంతి): యావత్ భారతాన్ని ఏకం చేసి భారతీయులందరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన గీతం "వందేమాతరం"(Vande Mataram) అని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, స్వాతంత్ర సమరంలో భారతీయులందరినీ ఏకం చేసిందని తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఎ.ఓ. పిన్న రాజేశ్వర్, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.