వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి
07-11-2025 08:56 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో వందేమాతరం గీతం150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయ సిబ్బంది , స్థానిక ప్రజలందరూ కలిసి సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించినట్లు కమిషనర్ టిఎస్వీఎన్ త్రిలేశ్వర రావు తెలిపారు. సామూహికంగా ప్రజలందరూ భాగస్వాములై ఆలపించడం శుభసూచకం అన్నారు.






