26-12-2025 09:39:10 PM
రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు మండల సమ్మయ్య
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి చర్చి సర్కిల్లోని ఓయాసిస్ అనాధ ఆశ్రయంలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి వేడుకలు రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు మండల సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, జై భీమ్ కన్వీనర్ తాళ్లపల్లి విజయ్ కుమార్, మేరీ, రవీందర్ (జె.కె), శ్రీనివాస్ గౌడ్, రాజకుమార్ రిషి కుమార్, ఆశ్రమం నిర్వాహకులు చంద్ర ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.