కూరగాయల సాగు చేపట్టాలి
మహబూబాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పంట మార్పిడి చేసి, 50 ఎకరాల్లో కూరగాయల పంటల సాగు చేపట్టాలని జిల్లా హార్టికల్చర్ అధికారి మరియన్న కోరారు. గురువారం కురవి, డోర్నకల్, బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, తొర్రూరుకు సంబందించిన రైతు ఉత్పత్తి కంపనీ లకు ప్రతీ ఒక్క స్వయం సహాయక సంఘం ద్వారా 50 ఎకరాలలో పంట మార్పిడి చేపట్టేందుకు, మహబూబాబాద్, కేసముద్రం మండలాల్లో అవగాహన కార్యక్రమాలు ని ర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎల్నినో, మారుతున్న వాతావరణ పరిస్తితులలో టమోటా, వంగ, పచ్చి మిరప, దోస, బీర, సొర, గోరు చిక్కుడు, బెండ, ఆకు కూరలు, మునగ, షేడ్ నెట్స్ క్రింద టమాట, కీర మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని కోరారు.
కూరగాయల పంటల సాగుకు ఎకరానికి రూ.21 00, అంతర పంటల సాగుకు, కూరగాయ ల శాశ్వత పందిరి నిర్మాణానికి ఎకరానికి లక్ష రూపాయల రాయితీ, ఎకరానికి రూ.10,00 0, కూరగాయల నారు మొక్కల సరఫరా, కూరగాయల చిరు సంచుల పంపిణీ వంటి పలు రాయితీ సౌకర్యాలు సద్వినియోగం చే సుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెర ట్లో, ఆయిల్ పామ్, ట్రెల్లిస్ మెథడ్లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి స్రవంతి, ఐకేపీ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్, సభ్యులు పాల్గొన్నారు.






