calender_icon.png 5 May, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట వి హెచ్ పి, బజరంగ్ దళ్ ధర్నా

04-05-2025 09:10:43 PM

నిబంధనలకు విరుద్ధంగా ఖని ఆర్టీసీ బస్టాండ్ లో అన్యమత ప్రచారం చేసిన క్రైస్తవులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..

గోదావరిఖని (విజయక్రాంతి): గోదావరి ఖని బస్టాండ్, డిపో సమీపంలో గత నెల 30 తేదీ నుండి ప్రతి రోజూ క్రైస్తవ మతానికి చెందిన వారు ప్రయాణికులను ఆసరాగా చేసుకుని క్రైస్తవ కరపత్రాలు పంచుతూ హిందు దేవి, దేవతలని దుర్భాషలాడుతూ హిందు ఆచార వ్యవహారాలనీ వ్యతిరేకంగా మాట్లాడుతూ... ప్రయాణికులను మత మార్పిడులకు పాల్పడుతున్న చర్యకి నిరసనగా ఆదివారం గోదావరిఖని బస్ డిపో ముందు విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడుతూ... గత నాలుగు ఐదు రోజులుగా గోదావరిఖని బస్టాండ్ ఏరియాలో క్రైస్తవ మత మార్పిడి కోసం మత ప్రచారం చేస్తున్న మత ప్రచారకులపై ఆర్టీసీ యాజమాన్యం కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో అనుమతి లేకుండా మత ప్రచారం చేస్తున్న వారికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నరనీ ఆర్టీసీ డిపో మేనేజర్ కనీసం అనుమతులు లేకుండా జరుగుతున్న చర్యకి ఇప్పటివరకు ఫిర్యాదు కూడా చేయలేదని, ఇలాంటి మత ప్రచార కార్యక్రమాలకి డిపో మేనేజర్ బాధ్యత వహించాలని ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్న కొంతమంది హిందూ యువకులపై పోలీసులు కేసులు చేయడం జరిగిందని, ఇది అక్రమ కేసులని,  02 తేదీన పాస్టర్ అభినయ, దర్శన్ ఎన్ఐ మీడియా యూట్యూబ్ ఛానల్ నిర్వాకుడు అభినయ దర్శనాన్ని పాస్టర్ కూడా గోదావరిఖని బస్టాండులో విచ్చలవిడిగా మత ప్రచారం చేస్తూ హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ మాట్లాడుతూ ప్రయాణికులను మతమార్పిడుకు గురి చేస్తున్న కూడా వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి చర్యలను సబబు కాదని తెలిపిన హిందూ యువకులపై కేసులు వేసిన సందర్భం కేవలం గోదావరిఖనిలోనే జరిగిందన్నారు. ఇది హిందూ సమాజంపైన ఇతర మతస్తులు చేస్తున్న దాడులు అంటూ ఇలాంటి దాడులను హిందూ సమాజం వ్యతిరేకిస్తున్నదని, ప్రభుత్వ పరిధిలో ఉన్న స్థలంలో మత ప్రచారం చేస్తున్న వారిపై గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని, తప్పకుండా ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్టీసీ రోడ్డు రవాణా శాఖకి ఫిర్యాదు చేస్తామన్నారు. హిందూ సంస్థలపై దుర్భాషలాడుతూ పాస్టర్ అభినయ దర్శన్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇలాంటి ఘటనలు మరో మారు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ బస్టాండ్ లో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని నిత్యం పోలీస్ శాఖ వారు నిఘా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ఇక్కడ జరిగే ప్రతి చర్యకు బాధ్యత వహించాలని, మత సమరస్యాన్ని దెబ్బతీసే విధంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, బస్టాండ్ లో జరిగిన మత కల్లోల ఆర్టీసీ డిపో మేనేజర్ బాధ్యత వహించాలని అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆర్టీసీ యాజమాన్యం కూడా చర్యలు తీసుకోకపోతే గోదావరిఖని హిందూ సమాజం కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హిందూ యువకులపై పెట్టిన పోలీస్ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

హిందూ సమాజం మతమార్పిడి అడ్డుకోవడం కోసం తప్పకుండా ముందుండాలని, మీ ఏరియాలోకి క్రైస్తవ మతమార్పిడి కరపత్రాలు పంచడానికి వస్తే 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇచ్చి అడ్డుకట్ట వేయాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ... పోలీస్ అవుట్ పోస్టు నిరంతరం ఉండేలా ఏర్పాటు చేస్తూ గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న చర్యలపై ఆర్టీసీ విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తామని, తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులకు హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నగర కార్యదర్శి మ్యాడగోని రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, అడిగొప్పుల రాజు, మునిగాల సంపత్, కొండపర్తి లింగన్న, పైతరి రాజు, జువెలరీ శ్రీధర్, కుమార్, దిగంబర్, పొన్నం అంజయ్య, మేడగోని అరవింద్, కొరివి వెంకటేష్, రమేష్ యాదవ్, అనిరుద్ గిరికుమార్, గోటిక శ్రీనివాస్, లక్ష్మయ్య, మధ్యల శ్రీనివాస్, గొట్టే నవీన్, ప్రకాష్, వేణు తదితర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.