16-06-2025 01:21:14 AM
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ వల్ల గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని మాజీమంత్రి హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్టు డిజైన్, కేంద్రానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించడం తెలంగాణ నీటిహక్కులను కాలరాయడమే అన్నారు.
ఈ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించేలోపే, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉండగా, ఏపీ యూ నిలేటరల్గా ముందుకెళ్తుండటం అన్యాయమన్నారు. ఈ మేరకు ఆదివారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి రాసిన లేఖలో ఆయన అనేక అంశాలు ప్రస్థావించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి 13 జూన్ 2025న కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసి ఈ ప్రాజెక్ట్ను వ్యతిరేకించినందుకు ఆయన్ని అభినందించారు.
రాజకీయాలకు తావులేకుండా ప్రభు త్వం కృషి చేస్తే బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని చెప్పారు. ఏపీ తీసుకుంటున్న చర్యలు 2014 రాష్ర్ట పునర్విభజన చట్టంతో పాటు నదీజలాల బోర్డుల నియమాలను ఉల్లంఘించడమే అని ఆరోపించారు. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలని విజ్ఞపి ్త చేశారు. గోదావరి జలాల్లో 969 టీఎంసీల తెలంగాణ వాటాలో ఇప్పటివరకు వినియోగం 600 టీఎం సీలకు పెరిగిందన్నా రు.
గోదావరి నదిపై రాష్ర్ట ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ వంటి బ్యారేజీలు, 19 లక్షల ఎకరాల స్థిరీకరణతో గోదావరి బేసిన్ అభివృద్ధి అయింద న్నారు. తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని, వాటిల్లో కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు నివేదిక, సమ్మక్కసాగర్, వార్ధా (బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు)లు ఉన్నాయన్నారు.
పోలవరం ద్వారా 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తరలిస్తే, తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనంగా 157.5 టీఎంసీలు హక్కుగా లభించాల్సిన వాటా అని అన్నా రు. ఈ 157.5 టీఎంసీలను నికర జలాల కేటాయింపులులేని పాత ప్రాజెక్టులకు వాడుకునే వెసులుబాటు తెలంగాణకు కలుగుతుం దన్నారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూ రు డిండి ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఏపీ వానాకాలపు వరదజలాలే తరలిస్తామన్నప్పటికీ, గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్లో ఆల్ వాటర్స్ అనే పదమే ఉందని నిపుణుల అభిప్రాయపడుతున్నారన్నారు. అదనపు జలాలు అనే అంశం గోదావరి అవార్డులో లేదన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు ఈ 157.5 టీఎంసీల అదనపు వాటాను కోరాలని, న్యాయ నిపుణుల తో చర్చించి తగిన చర్యలు చేపట్టాలన్నారు.