calender_icon.png 9 December, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి

09-12-2025 09:45:53 PM

కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సండ్రుగు శ్రీకాంత్..

చేగుంట (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సండ్రుగు శ్రీకాంత్ అన్నారు. మంగళవారం చేగుంట పట్టణ కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సండ్రుగు స్రవంతి సతీష్ లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కోసం ఉచిత కరెంటు, సన్న బియ్యం, రుణమాఫీ, మహిళా సంఘాలకు పొదుపు రుణాలు, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్లు, పట్టణ కేంద్రంలో అప్పటి మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలు మాడల్ స్కూల్, జూనియర్ కళాశాల, సీఎంఆర్ కాలనీ, పలు అభివృద్ధి పతకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.