19-06-2025 12:00:00 AM
భవనాలను పరిశీలించిన పంచాయతీరాజ్ డిఈ శ్రీనివాసరావు
యాచారం జూన్ 18 : మండలంలో మేడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పల్లె దవఖాన కోసం బుధవారం పంచాయతీరాజ్ డిఈ శ్రీనివాసరావు భవనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గతంలో ఉన్నటువం టి హాస్టల్ భవనాలను పల్లె దవఖానకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. హాస్టల్ భవనం మరమ్మ త్తులకు కోసం త్వరలో అంచనా వేసి పనులు చేయిస్తామని తెలిపారు.
త్వరలోనే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దవఖానను ప్రారంభించునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి లిక్కీ వెంకట్ రెడ్డి మాజీ సర్పంచ్ బొడ క్రిష్ణ , పి ఆర్ జి ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త, గ్రామ పంచాయితీ కారోబర్ రమేష్ , తదితరులుఉన్నారు.