పశ్చిమాసియాలో భీకర దాడులు
22వ రోజూ కొనసాగిన దాడులు
ట్యాంకర్లలోని 14 కోట్ల బ్యారెళ్ల చమురు అమ్ముకోవచ్చు: ట్రంప్
హోర్ముజ్ను తెరవడానికి సహాయం చేస్తానన్న బహ్రెయిన్
ఇరాన్లో 200 మంది పిల్లలతో సహా 1,330 మందికిపైగా మృతి
18,000 మందికిపైగా పౌరులకు గాయాలు
ఇరాన్కు సాయం చేస్తామన్న పుతిన్
టెహ్రాన్/వాషింగ్టన్/ఇరాక్, మార్చి 21: ఇరాన్తో అమెరికా- యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించగా, అస్థిరంగా ఉన్న మార్కెట్లను శాంతపరచడానికి ట్రంప్ ప్రభుత్వం, ఇరాన్కు సుమారు 14 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును విక్రయించడానికి తాత్కాలిక అనుమతిని మంజూరు చేసింది. మధ్యప్రాచ్యంలో, అమెరికా రాయబార కార్యాలయాలకు ముప్పు కొనసాగుతుండగా, కొన్ని గల్ఫ్ దేశాలు క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నాయి. శనివారం ఇజ్రాయెల్ బీరుట్, టెహ్రాన్లోని ప్రభుత్వ లక్ష్యాలపై కొత్తగా దాడులు చేసింది. ఈ ప్రాంతంలో పలు స్థావరాలపై వైమానిక దాడులు జరుగుతుండ డంతో, ఈ సంఘర్షణ వల్ల మానవ నష్టం పెరుగుతూనే ఉంది.
ఇరాన్, లెబనాన్లో భారీ ప్రాణనష్టం జరిగింది. ప్రజలు నిరాశ్రయులయ్యారు. ట్యాంకర్లలో ఉన్న 14 కోట్ల బ్యారెళ్ల చమురును అమ్ముకోవడానికి ఇరాన్కు అనుమతిస్తూ ట్రంప్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి తాత్కాలిక లైసెన్సును మంజూరు చేసింది. ఈ చమురు, ప్రపంచ డిమాండ్ను సుమారు ఒకటిన్నర రోజుల పాటు తీర్చడానికి సరిపో తుందని యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. యుద్ధం వల్ల తీవ్ర ఉద్రిక్తత లు నెలకొన్న హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సహాయం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన తొలి ప్రాంతీయ దేశంగా బహ్రెయిన్ నిలిచింది. ఈయూ దేశాలు, జపాన్, కెనడా సరసన ఇది చేరిందని దాని ప్రభుత్వ మీడియా శుక్రవారం నివేదించింది.
ఇదిలా ఉండగా, ఈ జలసంధిని నెలల తరబడి మూసివేసే అవకాశాన్ని నివారించడానికి యూఎస్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ, నిఘా అధికారులు తెలి పారు. ఇరాన్లో మృతుల సంఖ్య పెరుగుతోం ది. ఇరాన్ రెడ్ క్రెసెంట్, ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి అందించిన తాజా గణాం కాల ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్లో 18,000 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. కనీసం 200 మంది పిల్లలతో సహా 1,330 మందికి పైగా మరణించారు. లెబనాన్లో, ఆ దేశ ఆరో గ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన లాజిస్టిక్స్ స్థావరాన్ని మూడుసార్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రాయబార కార్యాలయం అనేక రాకెట్లు, డ్రోన్ల దాడులను ఎదుర్కొంది. యూఏఈని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్లోని ఇరాన్ దీవులపై దాడులు కొనసాగితే, రాస్ అల్-ఖైమా ఓడరేవు నగరంపై దాడి చేస్తామని టెహ్రాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వార్నింగ్ ఇచ్చింది. కువైట్, సౌదీ అరేబియాతో సహా పలు దేశాలు శనివారం తెల్లవారుజామున కూడా క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకున్నాయని గల్ఫ్లోని స్థానిక రక్షణ అధికారులు తెలిపారు.
ఇరాన్ తమ భూభాగం వైపు మరిన్ని క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అలాగే, రాత్రిపూట బీరుట్లోని ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు కూడా నివేదించింది. ఈ క్లిష్ట సమయంలో మాస్కో ఇరాన్కు ‘విశ్వసనీయ మి త్రుడు, నమ్మకమైన భాగస్వామి’గా ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరా న్కు చెప్పారు. మధ్యప్రాచ్యంలోని అమెరికా గల్ఫ్ దేశాల లక్ష్యాలను ఛేదించడానికి రష్యా అధునాతన డ్రోన్ వ్యూహాలతో ఇరాన్కు సహాయం చేస్తోందని ఒక పాశ్చాత్య నిఘా అధికారి ఈ నెల ప్రారంభంలో వెల్లడించిన విషయం తెలిసిందే.




