25-06-2025 11:59:37 PM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్
వలిగొండ,జూన్25(విజయక్రాంతి): వలిగొండ అక్కచెల్లెల చెరువు నుండి భీమలింగం కాలువ ద్వారా దిగువన ఉన్న ప్రాంతానికి నీటిని విడుదల చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో రైతులతో కలిసి నీటిని విడుదల చేయాలంటే రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్ మాట్లాడుతూ భీమలింగం ద్వారా వేలాది ఎకరాలు సాగు అవుతుంటాయని కల్వర్టుల ఆలస్యపు నిర్మాణాలతో నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈనెల 30 లోపు నీటిని విడుదల చేయాలని అన్నారు.
లేని పక్షంలో ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని వందలాది మంది రైతులతో కలిసి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. 1975 జూన్ 25న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎమర్జెన్సీ విధించి ఖుని చేసిందని అందుకే ఈ రోజున హత్య దివాస్ దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, బిజెపి జిల్లా, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.