26-06-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ
మిర్యాలగూడ, జూన్ 25 : బాల్య వివాహాలను నియంత్రించి లైంగిక దాడులపై అవగాహన కల్పించడంతో పాటు వారికి సరైన విద్య, ఆరోగ్యం అందించే విధంగా ఐసీ డీఎస్ అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం దుబ్బ తండా మహాత్మ జ్యోతి బా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో ’ ఆడపిల్లల సాధికారికతపై ’ ఏర్పాటు చేసిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బాలికలు వ్యక్తిగత ఆరోగ్యం, రుతుక్రమ సమస్యల పట్ల అవగా హన కలిగి ఉండాలన్నారు. మొబైల్ వాడకం తగ్గించి ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగా లని కోరారు. బాల్యవివాహాలను చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీడ బ్యూవో కృష్ణవేణి, సీడీ పీవో మమత, ఐసీ పీఎస్ వెంకన్న, డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ చరిత, ఎంఈవో బాలు నాయక్, డాక్టర్లు రవికుమార్, మోయిద్, ప్రిన్సిపల్ ఉమాదేవి ఉన్నారు.