26-06-2025 12:00:55 AM
హైదరాబాద్ (విజయక్రాంతి): ఇరాన్, ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం ఆపరేషన్ సింధు(Operation Sindhu)లో భాగంగా తీసుకొస్తోంది. ఈమేరకు మరో 25 మంది తెలంగాణ వాసులు బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్ నుంచి ఏడుగురు, ఇజ్రాయెల్ నుంచి 18 మంది రాష్ట్రానికి వచ్చారు. ఆ దేశాల్లో చిక్కుకున్న వారికోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసింది.