26-06-2025 12:47:43 AM
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఉంటుందని పీ సీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వే షన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని, ఈ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ను గౌరవిస్తానని, కానీ కాళేశ్వరం, ఫోన్ ట్యా పింగ్ లాంటి వ్యవహారాల్లో ఎంతటి వారైనా విచారణకు హాజరై, దోషులని తేలితే శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల విష యంలో బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదంటూ నిలదీశారు.
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకొచ్చారు. పీసీసీ, పీఏసీ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించామని, ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాం గ్రెస్ పార్టీ తిరుగులేని విజ యం సాధిస్తోందని ధీమా వ్య క్తం చేశారు.
మూడు ముక్కలాటలో బీఆర్ఎస్ పార్టీ ముగిసిందని, ఎమ్మెల్సీ కవిత చెప్పినట్టుగానే బీఆర్ఎస్లో దెయ్యాలుంటే.. కాంగ్రెస్లో దేవతలున్నారని అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కవితకు మద్దతు ఇవ్వడం విచారకరమన్నారు. క్యాబినెట్లో ఐదుగురు దళితులకు చోటు కల్పించామని, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.లక్షా 4 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వెలగబెట్టిందేమీ లేదని విమర్శించారు. దేశ చరిత్రలోనే ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య అని, ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎంతటివారు ఉన్నా శిక్ష తప్పదని మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ పలు పథకాల్లో జరిగిన కుంభకోణాలను వెలుగుతీసి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.