26-06-2025 12:47:44 AM
యాంటి డ్రగ్ క్యాంపెయిన్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జూన్-25 (విజయ క్రాంతి) జిల్లాలో డ్రగ్స్ మత్తు పదార్థాల వాడకాన్ని యువత తీవ్రస్థాయిలో వ్యతిరేకించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం జిల్లా కలెక్టరేట్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఏర్పాటు క్యాంపెయిన్ లో చేసిన కలెక్టర్ పాల్గోన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఐ యామ్ ఆంటి డ్రగ్ సోల్డియర్ ఫోటో పాయింట్ వద్ద కలెక్టర్ ఫోటో తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సరదా కోసం ప్రారంభమయ్యే డ్రగ్స్ లాంటి అలవాట్లు మన జీవితాలను నాశనం చేస్తాయన, డ్రగ్స్ కు బానిసైన వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
డ్రగ్స్ కు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 14446 కు వెంటనే అందించాలని, ఏదైనా అలవాట్లు ఉంటే మాన్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, వైద్యశాఖలో ఉన్న నిపుణుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి. వేణు గోపాల రావు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.