calender_icon.png 26 June, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా అక్రమ సరఫరా.. పట్టుకున్న పోలీసులు

26-06-2025 12:47:39 AM

కన్నాయిగూడెం,జూన్25(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామంలో గుడుంబా అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది సోమవారం రాత్రి ఎస్త్స్ర వెంకటేష్ పక్కసామాచారంతో గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకుని అతనిపై కేసు నమోదు చేశారు ఈసందర్భంగా ఎస్త్స్ర మాట్లాడుతూ ఏటూరు గ్రామంలో నైట్ పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో బుట్టాయిగూడెం గ్రామానికి సంబంధించిన దుర్గం గిరిబాబు అనే వ్యక్తి ప్రభుత్వ నిషేధిత గుడుంబాను అక్రమంగా సరఫరా చేస్తున్న క్రమంలో 6000 రూపాయల విలువ గల గుడుంబా పట్టుకోని కేసు నమోదు చేయడం జరిగింది.

బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయని, ఎవరు కూడా గుడుంబాను సరఫరా చేయడంగాని అమ్మడంగాని చేయరాదు. గుడుంబా వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. కుటుంబాలు వీధిన పడుతున్న సందర్బంలో ఎవరైనా అక్రమంగా గుడుంబా సరఫరా చేసే వారూ  మీకు కనిపిస్తే 8712670139 గాని 8712670089 నంబర్ కి కాల్ చెయ్యాలని మీ వివరాలు గోప్యంగా ఉంచబడును. సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషకం ఇవ్వబడును.