16-09-2025 01:19:52 AM
-అక్రిడిటేషన్ల కోసం ప్రత్యేక వెబ్సైట్
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాం తి): జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ర్ట రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నా రు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ కార్డ్ లు అందేలా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సచివాలయంలో హోమ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్తా, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్.
ప్రియాంక, సీపీఆర్వో జి.మల్సూర్తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్ట్ల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హైపవర్ కమిటీ తదతర అంశాలపై చర్చించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు హై పవర్ కమిటీని పునరుద్దరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి రాష్ర్టం లో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభు త్వం జీవో జారీచేసిందని, రాష్ర్టం ఏర్పడిన తరువాత ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. జర్న లిస్టుల జీత భత్యాలకు సంబంధించి త్రైపాక్షిక కమిటీని కూడా పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు.
జర్నలిస్టుల హెల్త్ పాలసీపై సమగ్రంగా చర్చించామని, ఇన్సూరెన్స్ పాలసీలో ఏది జర్నలిస్టు లకు ప్రయోజనకరంగా ఉంటుందో అనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి లోతైన అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అక్రిడిటేషన్లు జారీ కోసం జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్ సైట్ను తక్షణమే రూపొం దించాలని ఆదేశించారు. జర్నలిస్టులకు అవార్డులను పునరుద్దరించాలని ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ శ్రీనివాస్రెడ్డి విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ సి.ఇ.ఓ. ఉదయ్కుమార్, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ పాల్గొన్నారు.