calender_icon.png 25 June, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సవాళ్లను ఎదుర్కోబోతున్నాం

25-06-2025 12:00:00 AM

  1. మంత్రులు, పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి 
  2. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మనం గెలవాల్సిందే
  3. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి 
  4. జులైన 4న ఖర్గే రాక.. పీఏసీ, గ్రామ శాఖ అధ్యక్షులతోనూ సమావేశం  

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రాబోయే రోజుల్లో అనేక సవాళ్లను ఎదుర్కోబోతు న్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నాయని సీఎం వివ రించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల పనితీరుపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం  చేశారు.

ఆయా జిల్లాల్లో నామినేటెడ్ పదవు లు భర్తీ చేసే బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులకు అప్ప గించినా ఎందుకు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం సీట్లు గెలిచేలా ఇన్‌చార్జ్ మంత్రులే బాధ్య త తీసుకోవాలని ఆదేవించారు. మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమా ర్‌గౌడ్ అధ్యక్షతన  రాజకీ య వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి సీఎం రేవం త్‌రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరా జన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శి విశ్వనాథన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావుతో పా టు మంత్రులు, నాయకులు హాజరయ్యారు. ఆ త ర్వాత పీసీసీ ఉపాధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్య దర్శులకు సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కమిటీల్లో ఉన్న  నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లా లని, తానూ గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జులై 4న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే హైద రాబాద్‌కు రానున్నారని, అదేరోజు పీఏసీ సమా వేశంతో పాటు పార్టీ గ్రామ శాఖ అధ్య క్షులతోనూ సమావేశం కానున్నట్టు సీఎం చెప్పారు.

పనిచేయని వారి పదవులు ఊడుతాయి.. 

‘క్షేత్రస్థాయిలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు సమన్వ యంతో పని చేయాలి. గొడవలు ఉన్న జిల్లాల్లో సమస్యలను పరిష్కరిం చాలి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో పార్టీ గెలవాల్సిందే. బీఆర్‌ఎస్ అక్కడ ప్రచారం మొదలు పెట్టింది. మంత్రి పొన్నం ఆధ్వర్యంలో ఉపఎన్నికకు సిద్ధం కావాలి’ అని సూచించారు. మం త్రి పదవుల కోసం కొంతమంది కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయించడంపై సీఎం సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. పీసీసీ కార్యవర్గంలో ఉన్నవారు పని చేయకపోతే డిమోషన్.. పని చేస్తే ప్రమోషన్ ఇస్తా మని, పని చేయకపోతే పక్కనబెట్టడంలో మొహ మాటం అవసరం లేదన్నారు. 

పదేళ్లు అధికారం మనదే.. 

మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నేతలందరూ కలిసి పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. 2029 ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని, పదేళ్లు అధికారం మనదేనన్నారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ నిర్మాణంపై పీసీసీ దృష్టి సారించాలని, నాయకులంతా ఐక్యంగా పని చేయాలన్నారు.  

కులగణనతో మోదీకి సవాల్ విసిరాం.. 

వందేళ్ల కులగణన కలను తమ ప్రభుత్వం నెర వేర్చి.. మోదీ ప్రభుత్వానికి సవాల్ విసిరిందని సీఎం పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచి దేశంలో కుల గణన చేపట్టాలని నిర్వహించేలా చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 35 ఏళ్ల నుంచి పోరాటం చేశారని, అనేక మంది త్యాగాలు చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యకు పరిష్కారం చూపించామని తెలి పారు. పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామన్నారు. 

కష్టపడిన వారికి న్యాయం: మీనాక్షినటరాజన్

పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా అవకాశం లభిస్తుందని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ పేర్కొన్నారు. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు క్షేత్ర స్థాయిలో సమీక్షలు చేస్తున్నామని పీఏసీ సమావేశంలో వివరించారు. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశానికి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతోందన్నారు.

అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బీఆర్‌ఎస్ పాలన కంటే గొప్పగా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అయితే పార్టీ కార్యకర్తలు మాత్రం అసంతృప్తితో ఉన్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.