15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉపాధ్యాయ వృత్తిని కించ పర్చేలా ఉన్న విద్యా కమిషన్ రిపోర్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం

27-02-2026 09:54 PM

 పీఆర్టీయూటీఎస్ స్టేట్ కన్వీనర్ కర్రు సురేష్

మంథని,(విజయక్రాంతి): ఉపాధ్యాయ వృత్తిని కించ పర్చేలా ఉన్న విద్యా కమిషన్ రిపోర్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని *పీఆర్టీయూటీఎస్  స్టేట్ కన్వీనర్ కర్రు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం పూర్తి అవగాహన లోపం, ఉపాధ్యాయ వృత్తి ఏేపట్ల కుంచిత స్వభావంతో ప్రభుత్వానికి సమర్పించిన విద్యా కమిషన్ రిపోర్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉపాధ్యాయ వృత్తిని ఆర్ధిక దృక్కోణంలో చూడడం దురదృష్టకరమని, నైతిక విలువలని పెంపొందించి మానవ వనరులను అభివృద్ధి చేసి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయ వృత్తిని కార్పొరేటు ఉద్యోగి ల చూడడం, జీతాలు ఎక్కువని, ప్రమోషన్లు ఇవ్వొద్దని,

ఉపాధ్యాయ నియామకాల్లో క్షేత్ర స్థాయిలో సాధ్యం కాని ప్రతిపాదనలు చూస్తుంటే ఎంతటి అవగాహన రాహిత్యం తో తయారు చేసిన రిపోర్ట్ అనేది అర్థమౌతుందని, నిర్మాణాత్మక ఆలోచనలతో కాకుండా విమర్శనాత్మకంగా కమిషన్ కు సంబంధం లేని విషయాలను ప్రస్తావించి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ ను వెంటనే రద్దు చేసి,ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కై  సూచనలను క్షేత్ర స్థాయి లో అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులనుండి,మేధావుల నుండి సేకరించాలని సురేష్ కోరారు.