21-06-2025 08:33:05 PM
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు..
కరీంనగర్ (విజయక్రాంతి): హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy)ని అరెస్టు చేసి వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించాడన్ని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణా రావు(BRS District President G.V. Ramakrishna Rao) ఖండించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డిపై పాలక పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేస్తోందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ క్యాడర్లో భయాన్ని సృష్టించడానికి కాంగ్రెస్ కౌశిక్ రెడ్డి వంటి నాయకులను అరెస్టు చేస్తోందని, కానీ బిఆర్ఎస్ క్యాడర్ ఏదైనా పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
పాలక కాంగ్రెస్ పార్టీ ప్రజలపై విశ్వాసం కోల్పోయిందని, హామీ ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని, సమస్యలను మళ్లించడానికి అభివృద్ధి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో చురుకుగా పాల్గొంటున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ అరెస్టు చేసి వేధిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ పాలక కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేస్తోందని, తప్పుడు కేసులు పెడుతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పని తీరు పైన ప్రశ్నించే అధికారం ప్రజలకు, ప్రజా ప్రథినిధులకు ఉంటుందని, ప్రశ్నింస్తే దొంగ కేసులు బనాయించుతారా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు రేవంత్ రెడ్డితో కుమ్ముకై బిఆర్ఎస్ నాయకులపైన తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం కౌశిక్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటోందని, అతన్ని ఇబ్బందుల్లో ఉంచడానికి ఉద్దేశపూర్వకంగా అతనిపై అనేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. వరంగల్ పోలీసులు ఆరోపించినట్లుగా కౌశిక్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేనందున వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.