15 June, 2026 | 9:37 PM

Breaking News

నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •  

దేశ పురోగతికి సమిష్టిగా కృషి చేయాలి

15-11-2025 12:04 AM

ఎంపీ గొడం నగేష్

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్14 (విజయక్రాంతి): దేశ పురోగతి కోసం మహనీ యుల ఆశయాల స్ఫూర్తిగా కలిసి నడుద్దామ ని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ అన్నారు.

శుక్రవారం సర్దార్ వల్లభభా య్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేరా భారత్ ఐక్యత మార్చ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జిల్లా అధికారులు, యువజన సంఘా ల ప్రతినిధులు, విద్యార్థులతో కలిసి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి సమీకృత కలెక్టరేట్ భవనం నుండి కుమ్రం భీం చౌరస్తా మీదుగా తిరిగి సమీకృత కలెక్టరేట్ భవనం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గొడెం నగేష్ మాట్లాడుతూ దేశ పురోగతి కోసం అందరం కలిసి నడుద్దామని తెలి పారు. వల్లభభాయ్ పటేల్ దేశం కోసం, దేశ ఐక్యత కోసం అహర్నిశలు కృషి చేశారని, స్వాతంత్రోద్యమ పోరాటంలో తన వంతు పాత్ర పోషించి, స్వాతంత్రానంతరం దేశంలోని ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ వల్లభభాయ్ హయాంలో ఏర్పాటు అయిన సంస్థలు నేటికీ కొనసాగుతున్నాయని తెలిపారు.

హరీష్ బా బు మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని నేటి యువత దేశ ఐక్యత, పటిష్టత,అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.  అనంతరం అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్య క్రమంలో మేరా భారత్ కార్యక్రమం ఇంచార్జ్, జిల్లా యువ అధికారి శైలి బెల్లాల్, నోడల్ అధికారి రమాదేవి, జిల్లా క్రీడా యువజన శాఖ అధికారి అహ్మద్, జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.