calender_icon.png 16 June, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలి

15-06-2025 12:42:29 AM

ముషీరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): భోలక్ పూర్ లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు అంకిత భావంతో పనిచేస్తూ బీఆర్‌ఎస్ ను మరింత బలోపేతం చేయాలని భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ ఇన్చార్జి రాజా దీన్ దయాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావులు అన్నారు. శనివారం భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం రంగానగర్లో జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు ప్రతి నెల పోలింగ్ బూత్ల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషిచేయాలన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరి ష్కరిం చాలన్నారు. అప్పుడే ప్రజల్లో నాయకులకు, పార్టీకి ఆదరణ లభిస్తుందన్నారు.

అనంతరం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులకు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, గోవింద్ రాజ్, మైనార్టీ కమిటీ అధ్యక్షుడు మగ్బూల్, సోషల్ మీడియా ఇన్చార్జి ప్రవీణ్ కుమార్, నాయకులు కృష్ణ, మహేష్, కళ్యాణ్, అజీపాషా తదితరులు పాల్గొన్నారు.