17-10-2025 12:04:04 AM
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 16 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ది, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్ - 2047‘ అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తున్నదని, ఈ సర్వేలో ఉద్యోగులు, అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనేలా సిటిజన్ సర్వే చేపట్టారని అన్నారు.
ఈనెల 25 వ తేదీ వరకు కొనసాగే విజన్-2047 సర్వేలో అందరు ఉద్యోగులు పాల్గొనడంతో పాటు ఈ సర్వే లింక్ ను, QR కోడ్ ను తమ తమ కార్యాలయాల్లో ప్రదర్శించాలని, ఈ సర్వే గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ సర్వేలో పాల్గొనేందుకు http//www.telangana.gov.in/telanganarising/ లింక్ ద్వారా పాల్గొనాలన్నారు.