2 July, 2026 | 12:15 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

‘రాజీవ్ యువ వికాసం’ను సద్వినియోగం చేసుకోవాలి

09-04-2025 01:08 AM

శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు 

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు సూచించారు. ఏప్రిల్ 14 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 92 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.  అందరి అభ్యన్నతి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. శంషాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంటున్నామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. నాయకులతోపాటు ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శంషాబాద్ పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కమిషనర్ సుమన్ రావు పేర్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.