15-06-2025 12:13:08 AM
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే..
అదిలాబాద్ (విజయక్రాంతి): వర్షాకాల సమయంలో పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్(MP Nagesh), ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) పేర్కొన్నారు. ఇటీవల బేల మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు దుర్మరణం చెందడం బాధాకరమైన విషయమని అన్నారు. శనివారం బాధిత కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా సైతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇంద్రజిత్, కరుణాకర్ రెడ్డి, మురళీధర్, దత్తానిక్కం, సందీప్, రాము, నవీన్, మూడేశ్వర్, రాకేష్ సూర్య తదితరులు పాల్గొన్నారు.