calender_icon.png 15 June, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ యూజీ ఫలితాలు విడుదల

15-06-2025 12:13:41 AM

- రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌కుమార్‌కు ఆలిండియా ఫస్ట్‌ర్యాంక్

- సత్తాచాటిన రాష్ట్ర విద్యార్థులు 

- కాకర్ల జీవన్‌సాయికి 18వ ర్యాంక్..

- షణ్ముఖ్‌నిషాంత్ 37, మంగారి వరుణ్ 46, యండ్రపాటి షణ్ముఖ్ 48వ ర్యాంకులు

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. 22,76,069మంది దరఖాస్తు చేసుకోగా.. 22,09,318 మంది పరీక్షలు రాశారు. ఇందులో 12.36లక్షల మంది అర్హత సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది.

ఇందులో 9,65,996 మంది బాలురు, 13,10,062 మంది బాలికలు అర్హ త సాధించారు. రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌కుమార్ (99.9999547 పర్సంటైల్) అలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్ (99. 9999095)కు రెండో ర్యాంక్, మహారాష్ర్టకు చెందిన కృషంగ్ జోషి (99.9998189)కి మూడో ర్యాంక్ లభించింది. కాగా ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్‌కు మహిళల విభాగంలో తొలి ర్యాంకు దక్కింది. నీట్- యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మన రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు.

రాష్ర్టం నుంచి 41వేల 584 మంది వి ద్యార్థులు ఈ పరీక్షల్లో అర్హత సాధించారు. రాష్ట్రానికి చెందిన కాకర్ల జీవన్‌సాయికుమార్‌కు 18వ ర్యాంకు వచ్చింది. షణ్ముఖ్ నిషాం త్‌కు 37, మంగారి వరుణ్‌కు 46, యండ్రపాటి షణ్ముక్‌కు 48వ ర్యాంకు, బిదీష మా ఝి 95వ ర్యాంక్ సాధించారు. ఇక ఏపీ నుంచి 36వేల 776 మంది విద్యార్థులు అర్హత సాధించగా... ఆ రాష్ట్రానికి చెం దిన దర్బా కార్తీక్‌రామ్‌కు 19వ ర్యాంకుతో ఉత్తమ ఫలితం సాధించాడు.

నీట్ యూజీ ఫలితాలకు సంబంధించి విద్యార్థుల ఈ-మెయిల్‌కు స్కోర్‌కార్డులు పంపించారు. కాగా దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సులలో ప్రవేశాల కోసం మే 4న దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

ఆలిండియా టాప్ ఫైవ్ ర్యాంకర్లు

1. మహేశ్‌కుమార్ (రాజస్థాన్)

2. ఉత్కర్ష్ (మధ్యప్రదేశ్)

3. కృషంగ్ జోషి (మహారాష్ట్ర)

4. మ్రినాల్ కిషోర్ ఝా (ఢిల్లీ)

5. అవికా అగర్వాల్ (ఢిల్లీ)