04-06-2025 12:29:55 AM
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో యూఎస్కు చెందిన ‘ఎవర్జెంట్ టెక్నాలజీస్’ గ్లోబల్ వాల్యూ సెంటర్ను మంగళవారం మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించి మాట్లాడారు..
సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఏడాదిన్నర వ్యవధిలో రూ.3లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. ఏఐ, మెషిన్లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్కు హబ్గా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.
ఎమర్జింగ్ టెక్నాలజీస్లో తెలంగాణ యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాలస్థాయి నుంచే శిక్షణ ఇచ్చేలా నిపుణుల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూ పొందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూని వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ను గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ ఏఐ పవర్డ్ సబ్స్క్రుబర్ మేనేజ్మెంట్ అండ్ మానిటైజేషన్ ప్లాట్ఫామ్ ‘ఎవర్జెంట్ టెక్నాలజీస్’ గ్లోబల్ వాల్యూ సెంటర్ ద్వారా ప్రస్తుతం 600మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. రాబో యే రోజుల్లో ఈ సంఖ్య వేయిమందికి చేరుతుందన్నారు. హైదరాబాద్లో కార్యాలయా న్ని ప్రారంభించిన ‘ఎవర్జెంట్ టెక్నాలజీస్’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐఏఎస్ అధికారి భవానీ శ్రీ, ఐటీ సలహాదారు సాయికృష్ణ, ఎవర్జెంట్ టెక్నాలజీస్ ఫౌండర్, సీఈవో విజయ్ సజ్జ పాల్గొన్నారు.