30-06-2025 02:43:22 AM
డాక్టర్ కోట నీలిమ
సనత్ నగర్, జూన్ 29 (విజయ క్రాంతి): గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి సమావేశానికి హాజరై మాట్లాడారు.
జూలై 4న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లో పర్యటిస్తున్న సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ గ్రామ స్థాయి అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించడం చాలా శుభ పరిణామం అన్నారు. జై బాపు, జై భీమ్,జై సంవిధానం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గ్రామస్థాయి అధ్యక్షులు సమ్మేళనం జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో జై సం విధాన్ కార్యక్రమం విజవంతంగా సాగుతోందని పేర్కొ న్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. ఒక జాతీయ అధ్యక్షుడు గ్రామ, వార్డ్ స్థాయి అధ్యక్షుడిని కలవ డానికి రావడం చాలా గొప్ప విషయమని.. ఇలాంటివి కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అ న్నారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యాకర్తలం వెళ్లి ఖర్గే సభను విజయవంతం చేస్తామన్నారు.