calender_icon.png 21 January, 2026 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా ఏఈవోలకు న్యాయం చేస్తాం

06-11-2024 02:21:22 AM

మహిళా కమిషన్ 

చైర్‌పర్సన్ నేరెళ్ల శారద

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): మహిళా ఏఈవోలకు న్యాయం చేస్తామని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద హామీ ఇచ్చా రు. మంగళవారం కమిషన్ కార్యాలయంలో నేరెళ్ల శారదను మహిళా అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ (ఏఈవో)లు కలిశారు. డిజిటల్ క్రాప్ సర్వే లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

మహిళా ఏఈవోలకు అండ గా ఉండాలంటూ వినతిపత్రం అందజేశారు. మహిళా ఏఈవోల వినతిపై స్పందించిన కమిషన్ చైర్‌పర్సన్.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.