15 June, 2026 | 8:00 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

మహిళల హామీలు నెరవేర్చే వరకు పోరాడతాం

08-07-2024 12:59 AM

జూలై 9న ధర్నా చేస్తాం

బీజేపీ మహిళా మోర్చా రాష్ర్ట అధ్యక్షురాలు శిల్పారెడ్డి

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటి నా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం చూస్తే మహిళలపై కాంగ్రెస్ సర్కారుకు చిత్త శుద్ధి లేదని ఇట్టే అర్థం అవుతుందని బీజేపీ మహిళా మోర్చా రాష్ర్ట అధ్యక్షురాలు శిల్పారెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ, తెలంగాణ మహిళలకు అండగా జూలై 9న ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన హామీలపై ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కూడా లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.