03-06-2025 12:19:03 AM
- పినపాక శాసనసభ్యులు పాయం
పినపాక, జూన్ 2,(విజయ క్రాంతి); అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ రా జ్యంలో సంక్షేమ పథకాలు అందుతాయని పినపాక శాసనసభ్యులు పా యం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవా రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మణుగూరు కిన్నెరా కళ్యా ణ్ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యే క కార్యక్రమంలో పినపాక మండలంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ గృహాలకు పట్టాలను అందజేశారు.
పినపాక మండలం అమరారం గ్రామానికి చెందిన శీలం జ్యోతి, పోల బోయిన రమణ, కొట్టెం రజిత అనే మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, పినపాక మండలంలో గ్రామపంచాయతీ ప్రజలు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ సుధీర్ కుమార్, పినపాక ఎంపీడీవో సు నీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, గ్రామపంచాయతీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.