03-06-2025 12:18:54 AM
తహసీల్దార్ వెంకటేశ్వర్లు
కొత్తకోట జూన్ 2 : కొత్తకోట మండలంలోని అన్ని గ్రామాలలో రెవిన్యూ సదస్సులు ఈనెల 3 తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించబడునని తాసిల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవా రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని అన్ని రెవిన్యూ గ్రామాలకు సంబంధించి 2 టీం లను ఏర్పాటు చేశామని ఒకటి తాసిల్దార్ వెంకటేశ్వర్లు, రెండో టీం లీడర్ గా డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్ బాధ్యత వహిస్తారని తెలిపారు.
రైతులు వారికి ఉన్న రెవిన్యూ సమస్యలు ఈ విదంగా చూపబడినవి అని అన్నారు. కొత్త పాస్ పుస్తకాలు రానివారు, కొత్త పాస్ పుస్తకంలో వివరాలు తప్పుగా నమోదు అయినవారు అనగా సర్వే నెంబర్లు, విస్తీర్ణం, భూమి వివరణ సంక్రమించిన విధానం పట్టాదారు పేర్లు తండ్రి భర్త పేరు మొదలగునవి అని అన్నారు. వాస్తవముగా సాగులో ఉన్న భూమి కన్నా పాస్ పుస్తకంలో తక్కువ నమోదు అయిన వారు ఉన్నారని చెప్పారు.
వారి భూములు నిషేధిత జాబితా పిఓబి లో ఉన్నవారు కూడా పరిష్కరించుకోవాలని సూచించారు. సాదా బైనామా క్రమబద్ధీకరణ కాని వారు, ఓ ఆర్ సి రాని ఇనాం భూముల రైతులు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 38-E టెనెన్సీ ధ్రువపత్రం రా నివారు, లావుని భూమి సమస్యలు ఉన్నవారు,సర్వే సబ్ డివిజన్ సమస్యలు ఉన్నవారు కూడా సంప్రదించాలని కోరారు.
భూ సేకరణ ఎల్ ఏ సమస్యలు ఉన్నవారు వెంటనే భూ భారతి సదస్సులో పాల్గొని పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టమును అందరూ రైతులు సద్వినియోగం చేసుకొని వారికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని తహసీల్దార్ సూచించారు.