15-05-2025 02:05:00 AM
ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు
పెద్దపల్లి, మే14 (విజయ క్రాంతి): అకాల వర్షాల కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ఒక ప్రకట నలో తెలిపారు.
కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం పూర్తి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అకాల వర్షాల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న పంట వివరాలను సేకరించి రైతులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం పై నివేదిక అందించాలని మంత్రి వ్యవసాయ శాఖ అధికారులు,
వ్యవ సాయ విస్తరణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాల కారణంగా ఏ రైతు నష్టపోకుండా ప్రభుత్వం తమ వంతు సహకారం అందిస్తుందని రైతులు ఎటు వంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.