15-05-2025 02:07:31 AM
కరీంనగర్ క్రైం, మే14 (విజయక్రాంతి): సరస్వతీ పుష్కరాలలో విధినిర్వహణలో ఉండే ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా. ఏ.వి గిరిసింహారావు తెలిపారు. కాళేశ్వరంలోని ప్రత్యేక ప్రయాణ ప్రాంగణంలో ఈ వైద్య శిభిరం కొనసాగుతుందని మే15 నుండి 26 వరకు జరిగే ఈ శిబిరాన్ని సిబ్బంది వినియోగించుకోవాలని సూచించారు.
కరీంనగర్ జోన్ లోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం రీజియన్ లలోని ఆర్టీసీ ఉద్యోగులందరూ వినియోగించుకునే సదుపాయం కలదని తెలిపారు. వడదెబ్బ గాస్ట్రోఎంటరైటిస్ కి లోనుకాకుండా శుభ్రమైన నీటిని ఆహారాన్ని తీసుకోవాలని&మాస్క్ ధరించాలని& ఏ మాత్రం నలతగా ఉన్నా పక్కన ఉన్న వైద్యశిబిరాన్ని సంప్రదించాలని ప్రయాణికులు భక్తులకు సూచించారు.