calender_icon.png 28 September, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాం..

28-09-2025 06:48:35 PM

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్..

చిలుకూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక దొడ్డ నరసయ్య, భవనంలో తాళ్లూరి పెద్ద మల్లయ్య అధ్యక్షతన జరిగిన మండల కౌషల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా అయినటువంటి రిజర్వేషన్లు గ్రామాలలో పార్టీ బలబలాలు, పోటీ చేసే స్థానాలు వీటన్నిటిపై గ్రామ గ్రామాన పార్టీ నాయకత్వంలో కార్యకర్తలతో పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత రాష్ట్ర జిల్లా నాయకుల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు అవగాహన చేసుకుని కలిసి వచ్చే పార్టీల మద్దతుతో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పోటీ చేయడానికి మండల కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు అందరూ సమిష్టి కృషితో పార్టీ, మిత్రపక్షాల అభ్యర్థుల గెలుపు కోసం కులమతాలకు అతీతంగా పూర్తిస్థాయిలో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి షేక్ సాహెబల్లి, కాంపాటి వెంకటయ్య, కొండ కోటయ్య, పిల్లుట్ల కనకయ్య, చేపూరి కొండలు, రెమిడాల రాజు, దొడ్డ వెంకటయ్య, దొడ్డ నాగేశ్వరరావు, అలివేలు, వెంకటయ్య, ఇస్లావత్ అలియా, వెంకటయ్య, సుల్తాన్ వెంకటేశ్వర్లు, సైదులు, శ్రీను, రాంబాబు, నాగేశ్వరరావు, కోటేష్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.