calender_icon.png 12 January, 2026 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

10-01-2026 12:00:00 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, జనవరి 9 (విజయక్రాంతి): హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని మొత్తం 81 మంది లబ్ధిదారులకు 25 లక్షల 86,500 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్య విషయంలో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారని, అన్నివిధాలుగా అండగా నిందిస్తున్నారని అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సీఎం సహాయనిది అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత పాలకుల కాలంలో సహాయ నిధుల కోసం దళారీ వ్యవస్థ రాజ్యమేలేదని ప్రజలు చెక్కు పొందాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు.

కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటినుండి ఎవరికి నయా పైసా ఖర్చు లేకుండా నేరుగా లబ్ధిదారులకు చెక్కులు అందే విధంగా చేశామని పేర్కొన్నారు. అనంతరం 5వ డివిజన్ కొత్తూరు జెండాలో 30 లక్షల రూపాయల వ్యయంతో, 49వ డివిజన్ జూలైవాడ, రెవెన్యూ కాలనీలలో 1 కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీల పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ జడ్పీ ఫోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, మామిండ్ల రాజు, విజయశ్రీ రజాలి, వేముల శ్రీనివాస్, ఏనుగుల మానస రాంప్రసాద్, కాంగ్రెస్ నాయకులు బంక సంపత్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు తడక సుమన్ గౌడ్, సిరబోయిన సతీష్, అధికారులు, కాలనీవాసులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.