02-07-2025 04:39:34 PM
ఎంపీడీవో రమేష్ దీన్ దయాళ్
మునగాల: అర్హులైన లబ్ధిదారులందరు సంక్షేమ పథకాలు అందుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంపీడీవో రమేష్ దీన్ దయాళ్(MPDO Ramesh Deendayal) అన్నారు. బుధవారం మండల పరిధిలోని కలకోవ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంను ప్రతి ఒక్కరు తీసుకొవాలని కోరారు. మండల అభివృద్ధి కార్యాలయంలో ఒక ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా అధికారులు పనిచేయడం జరుగుతుందని చెప్పారు.
గృహ జ్యోతి ఉచిత గ్యాస్ సిలిండర్ కు దరఖాస్తు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి రెండవ దఫా అవకాశం ప్రభుత్వమే కల్పిస్తున్నదని తెలిపారు. ప్రజా పాలన దరఖాస్తుదారులు ఇప్పటికీ ఏమైనా పథకం అందకపోవడంతో తిరిగి మండల అభివృధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ సారధి కళాకారులు పాలకుర్తి శ్రీకాంత్ పల్లెల రాము గంట భిక్ష పతి గడ్డం ఉదయ్ పాక ఉపేందర్ కుందమల్ల నాగలక్ష్మి గజ్జి మంజుల సిరి పంగి రాధ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.