calender_icon.png 6 June, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాబినెట్‌లో తేలుస్తాం!

05-06-2025 01:16:30 AM

  1. ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత 
  2. బకాయిలు ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచం
  3. ఉద్యోగ సంఘాల జేఏసీతో క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వ బాధ్యత అని, సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించా లని సీఎం రేవంత్‌రెడ్డి.. క్యాబినెట్ సబ్‌కమిటీ, అధికారుల కమిటీని నియమించా రని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.

ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా, సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావులతో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో  సమావేశమైంది. ఇందులో అధికారుల కమిటీ సైతం పాల్గొన్నది.

ఉద్యోగ సంఘాల చర్చలనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా సానుకూలంగా నిర్ణయం తీసుకుం టామని తెలిపారు. ఉద్యోగ సమస్యలపై నియమించిన త్రీమెన్ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులను స్వీకరించిందన్నారు. స్వీకరించిన సమాచారాన్ని క్యాబినెట్ సబ్‌కమిటీకి వివరించారని ఆయన పేర్కొన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా బకాయి లు పేరుకుపోవడంతో అన్ని ఒకేసారి విడుదల చేయలేకపోయామని, ఇక ఎక్కువ కాలం పెండింగ్‌లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఉద్యోగ సంఘాలకు డిప్యూ టీ సీఎం వివరించారు. గురువారం క్యాబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో అధికా రుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగసంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఉద్యోగులను ప్రభుత్వంలో భాగస్వాములుగా తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ప్రజలకు చేయాల్సిన పనులు, అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యయం వీటన్నింటితోపాటు ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా భావిస్తోందని డిప్యూటీ సీఎం వివరించారు.

ఒకవైపు ప్రజలకు మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా కలిసి కూర్చుని చర్చించుకుని ముందుకుపోవాలన్న ఆలోచనతోనే క్యాబినెట్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో సమావేశమైనట్లు భట్టి వివరించారు.  గత పది సంవత్సరాల పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, అయి నప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలుచేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనలో భాగంగానే తమ ప్రభు త్వం రాగానే మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తోందన్నారు.

గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. వీటికి తోడు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలన్న తపనలో ప్రజాప్రభుత్వం ఉందని పేర్కొన్నా రు. ఇందుకు వనరులు సమకూర్చుకొని ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి భారం పడకుండా ముందుకెళ్తున్నామన్నారు. ఈనేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనలోనే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని ఆయన వివరించారు. 

సమస్యలను పరిష్కరిస్తాం..

ప్రభుత్వ ఆదాయానికి, ఖర్చుకు చేయాల్సిన పనులను బేరీజు వేసుకొని ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి బలంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన భరోసా ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఆస్పత్రుల ఖర్చులకు సంబంధించిన సమస్యలపై ఇప్పటికే చర్చించామన్నారు.

మరోసారి గురువారం జరిగే సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ, ఆర్థికశాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదిక రూపొందించి క్యాబినెట్‌కు నివేదిస్తామని, పరిష్కారం కనుగొంటామని చెప్పారు. సమావేశంలో అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్, లోకేశ్‌కుమార్, కృష్ణభాస్కర్, సందీప్‌కుమార్ సుల్తానియా, మహేశ్‌దత్ ఎక్కా తదితరులు పాల్గొన్నారు.