05-06-2025 01:17:04 AM
ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి, జూన్ 4 (విజయక్రాంతి): కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం రైతులకు చుట్టమని, ఎంతోకాలంగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు భూ భారతి చట్టం పరిష్కారం చూపుతోందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం టేకులపల్లి మండలం బేతంపూడి, బోడు గ్రామ పంచాయతీలలో మండల రెవెన్యూ అధికారుల అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా రాష్ట్ర ప్రజలు తరచుగా ఎదుర్కొనే భూవివాద సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతుందన్నారు. భూ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, అప్పీల్ వ్యవస్థ, ఆర్వో ఆర్ సవరణ వంటి వాటి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మండల ప్రజలు భూ భారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి తహసీల్దార్ వీరభద్రం, మండల రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.